ఫిదా పోరికి ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్

తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసింది సాయి పల్లవి. అరె.. అందం, అభినయంతో కట్టిపడేసింది. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమా తర్వాత సాయి పల్లవి రేంజ్ యే మారిపోయింది. ఆమె కోసం దర్శక-నిర్మాతలు క్యూ కట్టారు. తెలుగు, తమిళ్ నుంచి బోలేడు ఆఫర్లు వచ్చిపడ్డాయి. అదే సమయంలో గీ పోరిపై నెగటివ్ ప్రచారం మొదలైంది. ఈమెకి షార్ట్ టెంపర్ ఎక్కువ. టైంకి షూటింగ్ కి రాదు. దురుసుగా ప్రవర్తిస్తోంది. హీరోల ముందు టెక్కు చూపిస్తుంటుందనే ప్రచారం జరిగింది.

‘కణం’ సినిమా సమయంలో హీరో నాగ శౌర్య, ఎంసీఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్ సమయంలో నేచురల్ స్టార్ నాని సాయి పల్లవి గొడవపడింది. కోలీవుడ్ స్టార్ సూర్యకి ఈవిడ చుక్కులు చూపించిందనే కామెంట్స్ వినిపించాయి. ‘పడి పడి లేచే మనసు’ షూటింగ్ సమయంలో శర్వానంద్ బాధితుడే అన్న ప్రచారం జరిగింది. ఐతే, వీటన్నింటికి పులిస్టాప్ పెడుతూ సాయి పల్లవికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చాడు శర్వా.

‘సాయిపల్లవి మంచినటి. స్క్రిప్ట్ ను అర్థం చేసుకుని నటించే హీరోయిన్స్ లో ఆమెకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె చాలా తెలివైన హీరోయిన్’ అంటూ కితాబిచ్చాడు. శర్వా ఎప్పుడు మొహమాటానికి పోడు. అది కథల ఎంపిక విషయంలోనైనా.. ఇతరుల గురించి చెప్పే విషయంలోనైనా. ఈ నేపథ్యంలో శర్వా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇన్నాళ్లు సాయి పల్లవిపై జరుగుతున్న నెగటివ్ టాక్ కి పులిస్టాప్ పడినట్టేనని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే ఫిదా పోరి శర్వాకి థ్యాంక్స్ చెప్పాల్సిందే.