మహేష్’తో సినిమాపై శ్రీను వైట్ల ప్రకటన


దర్శకుడు శ్రీను వైట్ల సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి స్నేహితుడు. వీరిద్దరి కలయిలో దూకుడు, ఆగడు సినిమాలొచ్చాయ్. వీటిలో ‘దూకుడు’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ‘ఆగడు’ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆగడు తర్వాత శ్రీనువైట్లని వరుస ప్లాపులు పలకరించాయి. బ్రూస్లీ, మిస్టర్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో శ్రీనువైట్ల పనైపోయిందనే ప్రచారం జరిగింది. ఆయన మాత్రం తన స్నేహితుడు రవితేజతో జతకట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ’. ఈ శుక్రవారం (నవంబర్ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వైట్ల మహేష్ తో మరో సినిమా చేయడంపై స్పందించారు.‘మహేష్ నాకు మంచి స్నేహితుడు. ఐతే, వరుస పరాజయాలు ఎదురవుతూ వుండటంతో ఒక సినిమా చేసిపెట్టమని నేను మహేష్ ను అడిగినట్టుగా వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆయనకి తగిన మంచి కథ దొరికితే మాత్రం వినిపిస్తా’నని తెలిపారు. ఇక, మాస్ మహారాజా రవితేజ నాకు ట్రబుల్ షూటర్ లాంటోడు. తాను ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి నాతో సినిమా చేస్తాడని తెలిపారు. అమర్ అక్భర్ ఆంటోనీ పూర్తిగా వైట్ల మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందట. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా వైట్ల, రవితేజ ఇద్దరికి కీలకంగా మారనుంది. మరీ.. రిజల్ట్ ఏలా ఉంటుందన్నది చూడాలి.