‘తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా’ విడుదల

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాని విడుదల చేసింది. 10మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశారు.

* ఖానాపూర్ – రమేశ్ రాథోడ్

* సిరిసిల్ల – మహేందర్ రెడ్డి

* పాలేరు – ఉపేందర్ రెడ్డి

* మేడ్చల్ – కే లక్ష్మారెడ్డి

* ఖైరతాబాద్ – దాసోజు శ్రవణ్

* జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి

* భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి

* షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి

* ధర్మపురి – ఏ.లక్ష్మణ్

* ఎల్లారెడ్డి – జాజుల సురేందర్ లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు.

రెండో జాబితాలోనూ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు స్థానం దక్కలేదు. జనగాం స్థానాన్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. ఆ స్థానాన్ని టీజె ఎస్ కోరుకుంటోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం బరిలో దిగుతాడనే ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితా మాదిరిగానే రెండో జాబితాలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్క్ కనిపించిందని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే 65మంది కూడిన తొలి జాబితాని తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.