మరో 10స్థానాలకి అభ్యర్థులని ప్రకటించిన టీఆర్ఎస్


తెలంగాణలో నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడిక్కింది. పార్టీలు అభ్యర్థులని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ 75 స్థానాలకు, టీడీపీ 11 స్థానాలు, సీపీఐ 3 స్థానాలకి అభ్యర్థులని ప్రకటించాయి. ఇక, తెరాస తొలి జాబితాగా 105మంది జాబితాను ఆ తర్వాత మరో ఇద్దరు అభ్యర్థులని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ పార్టీ మరో 10 స్థానాలకి అభ్యర్థులని ఖరారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* వరంగల్ తూర్పు – నన్నపనేని రవీందర్

* మేడ్చల్ – చమకూర మల్లారెడ్డి

* మల్కాజిగిరి – మైనంపల్లి హనుమంతరావు

* ఖైరతాబాద్ – దానం నాగేందర్

* వికారాబాద్ – మెతుకు ఆనంద్

* చొప్పదండి – సొంకే రవిశంకర్

* అంబర్ పేట్ – కె వెంకటేష్

* గోషామహల్ – ప్రేమ్ సింగ్ రాథోడ్

* చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్

* హుజూర్ నగర్ – శానంపూడి సైదిరెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది.

ఇక, కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు మాత్రమే తెరాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు నానిమేషన్స్ దాఖలు చేసే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముందస్తు వ్యూహాంతో ప్రతిపక్షాలకి ప్రచారానికి పెద్దగా సమయం దొరకడం లేదు. ఇది టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.