దారుణం : బస్సు పేలి 42మంది సజీవ దహనం

జింబాబ్వేలో దారుణం చోటు చేసుకొంది. బస్సులో ఉన్న గ్యాస్‌ ట్యాంక్‌ పేలడంతో దాదాపు 42 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. జింబాబ్వే రాజధాని హరారేకు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఆ గ్యాస్ ట్యాంక్‌ ప్రయాణికుల్లో ఒకరిదిగా భావిస్తున్నారు. జింబాబ్వే రెడ్ క్రాస్‌ ట్విటర్‌లో పెట్టిన ఫొటోల్లో బస్సు పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారమ్.