అర్జున్ రెడ్డి దర్శకుడికి పిలుపు !


విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరం ‘దేవదాస్’ అనిపించుకొంది. ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్’గా మారిపోయాడు. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ హీరో అయిపోయాడు. ఇక, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ కెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ రిమేక్ ‘కబీర్ సింగ్’ చేస్తున్నారు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇలాంటి సమయంలో సందీప్ వంగా త్వరగా హైదరాబాద్ కు వచ్చేయ్ అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన తాజా చిత్రం టాక్సీవాలా. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.10.5 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు విశ్లేషకులు వెల్లడించారు. బాక్సాఫీస్ దగ్గర టాక్సీవాలా టెన్ థౌజెండ్ వాలాలా పేలడంపై సందీప్ వంగా స్పందించారు.

‘విజయ్ బాక్సాఫీస్ సక్సెస్ పట్ల సంతోషంగా ఉంది. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌, విజయ్ దేవరకొండకి కంగ్రాట్స్ చెబుతూ ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన విజయ్ త్వరగా హైదరాబాద్ వచ్చేయ్ అని రిప్లైయ్ ఇచ్చాడు. బహుశా.. సందీప్ హైదరాబాద్ రాగానే మాంఛి పార్టీ ఏమైనా ఇస్తాడేమో.. ! ఇక, టాక్సీవాలా హిట్ కిక్కులో ఉన్న విజయ్.. విశ్రాంతి ఏమీ తీసుకోకుండా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డియర్ కామ్రెడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.