ప్రపంచప్‌ సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తెలుసా ?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే సెమీస్ కు చేరుకొంది. గ్రూప్‌-బిలో భారత్‌ నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇదే గ్రూపులో ఆస్ట్రేలియా 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక, గ్రూప్‌-ఏ నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం ఏ1×బీ2, ఏ2×బీ1తో తలపడతాయి. దీంతో సెమీస్‌-1లో వెస్టిండీస్‌×ఆస్ట్రేలియా, సెమీస్‌-2లో భారత్‌×ఇంగ్లాండ్‌ తలపడతాయి. నవంబర్‌ 23న రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరీ.. సెమీ ఫైనల్ లో ఇంగ్లీష్ జట్టుని హర్మన్‌సేన ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి.