సాయి పల్లవిని డబ్బులిచ్చి వాడుకొంటున్నారు !

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ – సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘పడి పడి లేచె మనసు’. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా రీ-షూట్ జరుపుకొంటున్నట్టు సమాచారమ్. సినిమాలో సాయి పల్లవికి సంబంధించిన కొన్ని సీన్స్ అనుకొన్నంత బాగా రాలేదట. ఈ నేపథ్యంలోనే రీ-షూట్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.

దానికి సాయి పల్లవి కూడా ఓకే చెప్పిందట. ఐతే, రీ-షూట్స్ కోసం ఇచ్చే కాల్షీట్లకి అదనపు పారితోషికం డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించడంతో చిత్రబృందం రీ-షూట్ వెళ్లింది. రీ-షూట్ వెళ్లామని సినిమాపై అనుమానాలు అవసరం లేదు. సినిమా అద్భుతంగా ఉండబోతుందని చెబుతున్నారు.

ప్రేమకథా చిత్రాలని డీల్ చేయడంలో హను రాఘవపూడిది ప్రత్యేకమైన శైలి. ఇప్పుడు పడి పడి లేచే మనసు కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ – ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.