నగరంలో రెండు ప్రమాదాలు

హైదరాబాద్ లో ఈ ఉదయం రెండు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. వేకువ జామున ఓ కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్టు సమాచారమ్. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

సికింద్రాబాద్ మెట్టుగూడలో ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టి ముగ్గురు మృతి చెందారు. మెట్టుగూడ తొమ్మిదో నంబర్‌ మెట్రోపిల్లర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.