కాంట్రాక్టు ఉద్యోగులకి తీపి కబురు


కాంట్రాక్టు ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. 12 నెలల పాటు వేతనం అందజేయనుంది. మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 6 నెలల పాటు ప్రసూతీ సెలవులు ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకొంది. ఈ సిఫార్సులను కేబినెట్ ఆమోదించగానే అమల్లోకి రానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచాలనే ప్రతిపాదన చాన్నాళ్ల నుంచి ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకొంది.