‘సైరా’ దర్శకుడు మారాడు !

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా దర్శకుడు మారాడు. సురేందర్ రెడ్డి స్థానంలోకి కొత్త దర్శకుడు వచ్చాడు. ఆ కొత్త దర్శకుడు ఎవరో తెలుసా ? మెగాస్టార్ చిరంజీవియే. అవునూ.. సురేందర్ రెడ్డి షూటింగ్ కి ఆలస్యం రావడంతో చిరు మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేశాడట. ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కించారట. ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఓ రోజు సురేందర్ రెడ్డి షూటింగ్ కి ఓ గంట ఆలస్యంగా వచ్చాడట. ఓ ముఖ్యమైన పని ఉండటం వలన అలా జరిగిందట. ఈ విషయం తెలిసిన చిరు ఓ సన్నివేశానికి దర్శకత్వం వహించారట. అది సూపర్భ్ గా వచ్చిందట. సురేందర్ రెడ్డి వచ్చాక ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఇలా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం చిరుకి ఇదేం కొత్త కాదట. గతంలోనూ పలుమార్లు మెగా పట్టుకొని కొన్ని సీన్స్ కి డైరెక్షన్ చేశాడట. మరీ.. సైరా చిరు డైరెక్ట్ చేసిన సీన్ ఏలా ఉండబోతుందో చూడాలి.

తొలి స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కుతోంది. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు సరసన నయనతార నటిస్తోంది. వి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా .. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది. రామ్ చరణ్ నిర్మాత.