విజయ్’ని ఇష్టపడుతున్న జాన్వీ కపూర్ !

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండని ఇష్టపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీనే తెలిపింది. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకి హాజరైంది. ఈ షోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్.. జాన్విని ఒకరోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే ఏ నటుడ్ని ఎంచుకుంటావు అని అడిగాడు.

దీనికి జాన్వీ ఏ మాత్రం తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అనేసింది. అంతేకాదు విజయ్ తో కలిసి సినిమా చేయాలని ఉందనే కోరికని బయటపెట్టింది. జాన్వీ సమాధానం చెప్పిన తర్వాత కరణ్ విజయ్ గురించి గొప్పగా చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఈ సినిమా రిమేక్ ‘కబీర్ సింగ్’లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. చూస్తుంటే విజయ్ పై జాన్వీ ఇష్టాన్ని పెంచుకొన్నట్టు కనబడుతోంది.

విజయ్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల తాను కరణ్ జోహార్ ని ఆయన ఇంట్లో కలిశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విజయ్. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ విజయ్-జాన్వీ జంటగా ఓ సినిమాని ప్లాన్ చేస్తాడేమో చూడాలి. ఇక, విజయ్ తాజా చిత్రం టాక్సీవాలా కలెక్షన్స్ లో అదరగొడుతోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 30కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు సమాచారమ్. రిలీజ్ కి ముందే లీకైన టాక్సీవాలా కలెక్షన్స్ ని చూసి ఇండస్ట్రీ ఆనదం వ్యక్తం చేస్తోంది.