శ్రద్దాని మాములుగా మేపడం లేదుగా.. !


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇక్కడ శ్రద్దాకి అతిథి మర్యాదలు మాములుగా జరగడం లేదు. ఆమె కోసం రుచికరమైన వంటలని రెడీ చేస్తున్నారు. మంగళవారం శ్రద్దాకి లంచ్ టైంలో బోలేడు ఐటమ్స్ వడ్డించారు. 8రకాలతో చేసిన భోజ‌నాన్ని చ‌క్క‌గా తినేసింది. దానికి సంబంధించిన పిక్ ని శ్రద్దా తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది. త‌న‌కు తెలుగు వారు ఇచ్చిన అతిథ్యం ఎప్ప‌టికీ మ‌ర‌వలేన‌ని కామెంట్ పెట్టింది. ఇది చూసినోళ్లంతా శ్రద్దాని బాగానే మేపుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రద్దా తొలిసారి షూటింగ్ కి హాజరైన టైంలోనూ ప్రభాస్ ఆమె కోసం ప్రత్యేక వంటకాలు రెడీ చేశారు. అంతేకాదు దగ్గరుండి వడ్డించినట్టు తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రదాకు అవే అతిథి మర్యాదలు జరుగుతున్నాయని సమాచారమ్. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.