సెహ్వాగ్‌ మెచ్చిన ఓపెనర్స్


సచిన్ – సౌరభ్ కలిసి బ్యాటింగ్ చేస్తే చూడముచ్చటగా ఉండేది. ఓపెనర్స్ గా టీమిండియాకి ఎన్నో విజయాలని అందించి ఈ జంట. ఆ తర్వాత సచిన్ కి జోడీ వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చేశాడు. సెహ్వాగ్‌ దూకుడు, సచిన్ క్లాస్ షాట్స్ తో అదరగొట్టేవాళ్లు. సెహ్వాగ్‌ – గౌతమ్ గంభీర్ జోడీ బాగా కుదిరింది. ఐతే, ప్రస్తుతం టీమిండియా ఓపెనింగ్ జోడి ఎవరైతే బాగుంటుందనే చర్చ జరుగుతోంది.

డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొదటి టెస్టులో భాగంగా యువబ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌లను ఓపెనర్లుగా దింపాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రాణించగల సత్తా వారికుందని ఆయన అశాభావంవ్యక్తం చేశారు. నేనే గనుక కెప్టెన్‌ అయి ఉంటే అన్నీ సిరీస్‌లలోనూ షా, రాహుల్‌లను ఓపెనర్లుగా దింపేవాడినని చెప్పుకొచ్చారు. మరీ.. కోహ్లీ ఎవరిని ఓపెనర్స్ గా దించుతాడో చూడాలి.