‘#RRR’లో ప్రియమణి.. నిజమా ?

రాజమౌళి మల్టీస్టారర్ #RRR గురించి తెలిసింది గోరంత. తెలియాల్సింది కొండంత. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ ని ‘బాహుబలి’ అంతకుమించేలా తీసుకొచ్చే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడనే విషయాలు మాత్రమే తెలుసు. ఇందులో హీరోయిన్స్ ఎవరు ? మిగిలిన కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల విషయాలేవీ ఇంకా తెలియరాలేదు.

ఇలాంటి నేపథ్యంలో #ఆర్ఆర్ఆర్ కోసం సీనియర్ హీరోయిన్ ప్రియమణిని తీసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ ‘యమదొంగ’ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఓ కీలక పాత్ర కోసం ఆమెని తీసుకొన్నట్టు చెప్పుకొంటున్నారు.ఇటీవల ఎన్టీఆర్ పై ప్రియమణి ప్రేమని కురిపించింది. తారక్ అంటే ఇష్టమని తెలిపింది. బహుశా.. ఆర్ఆర్ఆర్ ఆమెని తారక్ రికమెండ్ చేసిన నేపథ్యంలోనే ఆ ప్రేమ పుట్టుకొచ్చిందేమోనని చెప్పుకొంటున్నారు.

ఇక, ఈ మల్టీస్టారర్ కోసం రావణ రాజ్యం, తారక్ రామ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో #RRR ని తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేసినట్టు తెలిసింది. హీరోయిన్స్ గా రష్మిక మందన, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కోసం కూడా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారంట. మొత్తానికి.. రాజమౌళి దేశం గర్వించదగ్గ మరో సినిమా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.