#ఆర్ఆర్ఆర్’లో విజయ్ దేవరకొండ.. గెస్ట్ రోల్ !


టాలీవుడ్ సెన్సేషనల్‌ విజయ్‌ దేవరకొండ బాలీవుడ్ కెళ్లనున్నాడు. త్వరలోనే అక్కడ ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమేనని విజయ్ ఒప్పుకొన్నారు. ఇప్పటికే ఓ సారి ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ని ఆయన నివాసంలో కలిశానని తెలిపారు. విజయ్ ని బాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యతని కరణ్ తీసుకొన్నట్టు తెలిసింది. ఇటీవల కరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ విజయ్ పేరు ప్రస్తావనకి వచ్చింది. షోలో పాల్గొన్న అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, హీరోయిన్ జాహ్నవి కపూర్ అవకాశం వస్తే విజయ్ లా మారిపోవాలని ఉందని.. ఆయనతో కలిసి నటిస్తానని తెలిపింది.

ఇదంతా కరణ్ ప్లానింగ్ అనే ప్రచారం జరుగుతోంది. విజయ్ కి బాలీవుడ్ క్రేజ్ ని తీసుకొచ్చేందుకే జాహ్నవి నోటితో విజయ్ ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు విజయ్ బాలీవుడ్ సినిమా ఫిక్సయినట్టు సమాచరమ్. ఐతే, పూర్తిస్థాయిగా హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు ముందుగానే ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ సినిమా 2020సంవత్సరంలో విడుదల కాబోతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గెస్ట్ పాత్రలో కనిపించే సినిమా #ఆర్ఆర్ఆర్ అయి ఉంటుందని చెప్పుకొంటున్నారు. బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ కరణ్ విడుదల చేయబోతున్నారు. ఆయనే విజయ్ గెస్ట్ రోల్ ని ప్లాన్ చేశాడట.

రాజమౌళి #ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరో విలన్ గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇందులో తారక్, చరణ్ లు ఇద్దరు కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి. డివివి దానయ్య నిర్మాత. 2020లో ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.