ఓటుతో క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ స్టార్స్ ఆదర్శంగా నిలిచారు. తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. అంతేకాదు.. తమలాగే అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి, అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, గోపీచంద్, రాఘవేంద్ర రావు.. తదితరులు ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఇక, విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ ఈసారి ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నానని ట్విటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కుని వియోగించుకొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన అభిమానులకి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ లుక్ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ బాగా లావెక్కి దొబ్బుగా ఉన్నారు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ని తలపిస్తున్నారు. ఐతే, అది ఎన్టీఆర్ లుక్ కాదని ఆయన పర్సనల్ ట్రైయినర్ చెప్పినా.. ఆ ప్రచారానికి పులిస్టాప్ పడటం లేదు. శుక్రవారం ఓటు వేసిన తారక్ తన లుక్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

తారక్ గడ్డెం పెంచాడు. కానీ, ఏమాత్రం లావెక్కలేదు. ‘అరవింద సమేత’లో కనిపించిన ఫిజిక్ తోనే కనిపించారు. దీంతో కొన్నాళ్లుగా తారక్ లుక్ పై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టమైంది. ఇక, #ఆర్ఆర్ఆర్ తొలి షెడ్యూల్ గురువారంతో ముగిసింది. ఫస్ట్ షెడ్యూలో తారక్, చరణ్ లపై ఓ యాక్షన్ సీన్ ని చిత్రీకరించారు. ఇందులో హీరోయిన్స్ ఎవరు ? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ నెల 12న రాజమౌళి హీరోయిన్స్ ని ప్రకటిస్తారని చెప్పుకొంటున్నారు.