కాంగ్రెస్ సీనియర్లకి షాక్

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సీనియర్లకి షాక్ తగిలేలా కనబడుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పలువురు కాంగ్రెస్ సీనియర్లు వెనకంజలో ఉన్నారు. జానారెడ్డి, గీతారెడ్డి, డీకె అరుణ, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్ రెడ్డి.. తదితరులు వెనకంజలో ఉన్నారు.

ఇక, మేడ్చల్ లో తెరాస ఆధిక్యంలో ఉంది. సూర్యపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. ప్రజాకూటమి ముఖ్యంగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కూకట్ పల్లి స్థానంలో తెరాస ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి సుహాసిని వెనుకంజలో ఉంది. మొత్తంగా.. తెరాస మరోసారి ప్రభుత్వాని ఏర్పాటు చేసేలా కనబడుతోంది.