చరణ్’ని అనాధ చేశాడు

సినిమాలో హీరోని అనాథ చేస్తుంటారు దర్శకులు. ఆ అనాథ కుర్రాడి జీవితకథని ఆసక్తిగా చూపిస్తుంటారు. ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అదే చేశాడు. రామ్ చరణ్ ని అనాథగా చూపించబోతున్నాడట. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బోయపాటి మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది.

ఇప్పుడీ సినిమా కథ ఇదే అంటూ.. ఓ లైన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ లైన్ ప్రకారంలో సినిమాలో రామ్ చరణ్ ఒక అనాథ. ఆ అనాథ బాలుడికి ఎలాంటి ఫ్యామిలీ దక్కింది. వారి కోసం చరణ్ ఏం చేసాడు అనేది సినిమా కథ చెబుతున్నారు. ఈ లైన్ కి యాక్షన్ + ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి బోయపాటి తనదైన మార్క్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఒకటి ఐటమ్ సాంగ్. ఈ సాంగ్ కోసం రకుల్, కాజల్ ని అనుకొన్నా.. చివరికి హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఫిక్సయినట్టు సమాచారమ్. ఇదీగాక, ఓ డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. దీన్ని చరణ్-కైరా అద్వానీలపై హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నారు.

ఇక, ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహా.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా వినయ విధేయ రాముడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.