పరశురామ్ కోసం త్రివిక్రమ్’ని వదులుకొన్నాడా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ చాన్నాళ్ల నుంచి దర్శకుడు త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఐతే, అది ఫైనల్ స్క్రిప్టు ఒకే కాకముందే క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక, అప్పటి నుంచి బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘అరవింద సమేత’ విడుదలైన వెంటనే త్రివిక్రమ్ బన్నీ సినిమా కోసం పని మొదలెట్టనున్నాడని చెప్పుకొన్నారు. అదే జరిగింది. బన్నీ కోసం త్రివిక్రమ్ కథని రెడీ చేశారు. సంక్రాంత్రి తర్వాత సినిమా ప్రారంభం కానుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారనే వార్తలొచ్చాయ్. దీంతో బన్నీ అభిమానులు ఆనందంలో ఉన్నారు.

ఇంతలో షాకింగ్ ఓ న్యూస్. బన్నీ-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం మొదలైంది. దీని వెనక ఓ కారణం ఉంది. ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్ తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వచ్చేసింది. ఐతే, అల్లు అర్జున్ హీరోగానే పరశురామ్ సినిమా ఉండనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం నిజమా.. ? కాదా.. ?? అని తెలియాలంటే సంక్రాంత్రి పండగ వెళ్లే వరకు ఆగాల్సిందే. అప్పుడు ఎలాగో బన్నీ సినిమా ప్రారంభం అవుతుంది. అది త్రివిక్రమ్ దర్శకత్వంలోనా.. లేక పరశురామ్ దర్శకత్వంలోనే అన్నది అప్పుడే తెలియాలి. ఈలోగా ఈ ప్రచారంపై బన్నీ క్లారిటీ ఇస్తే మరీ మంచింది.