గమనిక : త్రివిక్రమ్ సోషల్ మీడియాలో లేడు

దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన ఓ మాట ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్.. లాంటి సోషల్ మీడియా వేదికల్లో లేరట. ఈ విషయాన్ని స్వయంగా త్రివిక్రమ్ నే తెలిపారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి త్రివిక్రమ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు మెగా అభిమానులని ఖుషి చేశాయి.

రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా ప్రస్తావించిన సందర్భంలో.. త్రివిక్రమ్ తనకి ట్విట్టర్, ఫేస్ బుక్.. లాంటి సోషల్ మీడియా వేదికలు లేవని తెలిపారు. అందుకే రంగస్థలం సినిమా చూసిన వెంటనే నేరుగా చరణ్ కి ఫోన్ చేసి అభినందించానని తెలిపారు. ఇక, ఈ వేడుక వేదికగా త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని తెలిపారు. ప్రస్తుతం చిరు సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.