చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మూకుమ్మడి దాడి ప్రారంభమైనట్టు కనబడుతోంది. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చంద్రబాబుని ఓ రౌండ్ వేసుకొన్న సంగతి తెలిసిందే. హైకోర్టు విభజన, ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి కేంద్రం అందిస్తున్న నిధులు, హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రంలో తృతీయ ఫ్రంట్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు.. ఇలా ప్రతిదాంట్లోనూ బాబుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు. చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుని కేసీఆర్ రేప్ చేసేశారు.

అంతకంటే ముందు వైసీపీ నుంచి సీఎం చంద్రబాబుకి ఎటాక్ ఎదురైంది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యనించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాదు. ఆ భయం సీఎం చంద్రబాబుకు పట్టుకొందని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇవే మాటలు చెప్పారు. బహుశా.. ముందస్తు వ్యూహంలో భాగంగానే అక్కడ వైకాపా, ఇక్కడ కేసీఆర్ చంద్రబాబుపై దాడి దిగినట్టు అనిపిస్తోంది.