మైసూరా జనసేన గ్లాసుతో టీ-తాగుతారా ?

రాయలసీమ సీనియర్ నేత మైసూరా రెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడున్న సీమ సీనియర్ నేతలలో మైసూరా కూడా ఒకరు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న మైసూరా 2004లో టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీ రాజ్యసభకి పంపింది. ఆ పదవీకాలం పూర్తవుతున్నా పట్టించుకోలేదని వైసీపీలో చేరారు. జగన్ జైలులో ఉన్న సమయంలో విజయమ్మతో పార్టీని నడిపించారు. జగన్ జైలు నుంచి బయటికిరాగానే మైసూరా వైసీపీ నుంచి బయటికొచ్చారు.

కొన్నాళ్ల పాటు సైలైంట్ గా ఉన్న మైసూరా.. ఈ మధ్యనే నా సీమకు అన్యాయం జరిగిపోతుందంటూ మీడియా ముందుకొచ్చాడు.అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం మీద మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన చూపు జనసేన వైపు మళ్లింది. త్వరలోనే మైసూరా గ్లాజు గాజుతో టీ తాగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మైసూరా జనసేనలోకి వస్తే ఆ పార్టీకి సీమలోనూ బలం పెరగనుంది.