గురువు మరణంపై సచిన్ స్పందన

క్రికెట్‌ దిగ్గజం, సచిన్‌ టెండూల్కర్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ (87) బుధవారం సాయత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై బీసీసీఐ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా, గురువు మరణంపై సచిన్ స్పందించారు. ఆయన ఎప్పుడూ మన హృదయాల్లోనే ఉంటారని ట్విట్ చేశారు.

‘తన జీవితంలో గురువు ప్రధాన్యతని వివరిస్తూ చిన్న పాటి నోట్ రాసుకొచ్చారు సచిన్. నా జీవితంలో గురువు గారి పాత్రని మాటల్లో చెప్పలేను. గత నెలలో కొందరు స్టూడెంట్స్ తో కలిసి సర్ ని కలిశాను. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకొన్నాం. గత జ్ఝాపకాలని గుర్తు చేసుకొన్నాం. ఆయన మాకు స్టయిట్ గా ఆడటం.. స్టయిట్ గా జీవించడం నేర్పించారు. మీ జీవితంలో మేము ఓ భాగం అయినందుకు థ్యాంకు సర్.. ‘ అంటూ రాసుకొచ్చారు.