వైసీపీలో చేరబోతున్న అలీ.. ముహూర్తం ఫిక్స్ !

టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీ ఖరారైనట్టు సమాచారమ్. ఆయన వైసీపీలో చేరబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. ఈ సభా వేదికగా జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరబోతున్నారు.

గత నెల డిసెంబర్ 27న ఎయిర్ పోర్టులో అలీ జగన్ ని కలిశారు. ఆ సమయంలోనే అలీ వైసీపీ చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది.
అలీ రాజమండ్రి స్థానాన్ని కేటాయిస్తా ? మరో స్థానం నుంచి బరిలోకి దించుతారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ నటులు పృధ్వీ, పోసాని కృష్ణ మురళీ వైసీపీలో చేరారు. ఇప్పుడు అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వాస్తవానికి అలీ ఆయన స్నేహితుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని అందరు భావించారు. ఐతే, అందుకు భిన్నంగా అలీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడం.. ఆ ప్రయత్నాలు ఫలించడం పవన్ అభిమానులని ఆలోచనలో పడేశాయి. బహుశా.. ఏ పార్టీ నుంచి చేరినా భవిష్యత్ లో అలీ పవన్ పార్టీలో చేరతారేమో.. !