మరో బాలీవుడ్ హీరోయిన్ విజయ్’కి పడిపోయింది

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ లోనూ మారుమ్రోగిపోతోంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయ్ మీద మనసుపారేసుకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల కరణ్ జోహార్ ‘కాపీ విత్ కరణ్ షో’లో మాట్లాడుతూ.. అవకాశం వస్తే విజయ్ దేవరకొండలా మారిపోతానని చెప్పింది. అంతేకాదు.. అవకాశం వస్తే ఆయనతో రొమాన్స్ చేయాలనుంది.. అదేనండీ కలిసి నటించాలనుంది తెలిపింది.

ఆ తర్వాత ఓ వెబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది ? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది ?’ అనే ప్రశ్నకు.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం చెప్పింది. విజయ్ నటించిన ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే ..’ అనే సాంగ్ అంటే ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది. మొత్తంగా చూస్తే.. జాన్వీ విజయ్ కి పడిపోయినట్టు స్పష్టమవుతోంది.

ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా విజయ్ కి పడిపోయింది. ఆమె బాలీవుడ్ హీరోయిన్ అయినా.. తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. ఆమె కైరా అద్వానీ. మహేశ్ ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంత్రి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కైరా.. అర్జున్‌ రెడ్డి సినిమా చూశాక హీరో విజయ్‌ దేవరకొండకు అభిమానిగా మారిపోయానని తెలిపింది.