టీమిండియాపై మహేష్ ప్రశంసలు

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్రహ్మాండమైన విజయాన్ని అందుకొన్న టీమిండియాకు అభినందనలు. దేశం గర్వించదగ్గ విజయం’ అని కొనియాడారు.

ఈ విజయంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

ఇక, మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది మహేష్ నటిస్తున్న 25వ సినిమా. వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పివిపి-దిల్ రాజు-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.