కేటీఆర్ అను నేను..

తెలంగాణ శాసనసభ గురువారం కొలువుదీరింది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మాద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఇంకా బీజేపీ నేత రాజాసింగ్‌, ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్‌, జాఫర్‌ హుస్సేన్‌, టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్యలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో భారీ మెజారిటితో నాలుగవ సారి గెలిచి ఈ రోజు అసెంబ్లీ లో ప్రమాణస్వీకారం చేశాను’ అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.