స్పీకర్ పోచారం.. !

తెలంగాణ శాసనసభ స్పీకర్ గా తెరాస సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన ప్రయత్నాలు ఫలించాయి. స్వీకర్ ఎన్నికపై సీఎం కేసీఆర్ అన్ని పార్టీల నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. స్వీకర్ ఎన్నికని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కోరారు. అందుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో స్వీకర్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రేపు (శుక్రవారం) స్వీకర్ ఎన్నిక జరగనుంది. స్వీకర్ గా పోచారంని ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంచనమే. ఇక, గురువారం ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మాద్ ఖాన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 114మంది సభ్యులు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.