‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. వర్మ ట్విస్ట్ అదిరింది !


ఎన్టీఆర్ వర్థంతి (జనవరి 18) సందర్భంగా ఇవాళ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి కీలక ప్రకటన రాబోతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాణం పోసుకోబోతోంది” అంటూ వర్మ ట్విట్ చేశారు.

ఈ నేపథ్యంలో వర్మ ఎలాంటి షాకిస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తీరా సాయత్రం 5గంటలకి వర్మ తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు. ఈనాడు పేపర్ ప్రకటన అన్నట్టుగా.. ‘నందమూరి తారకరామారావు గారి విశ్వాసాల మీద గౌరవంతో ఈ రోజు సా॥ 5గంటలకి బదులుగా సా॥ 6గం. 57నిమిషాలకు దివ్య ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్ టీఆర్ పునర్శనం” అంటూ రాసి ఉన స్లిప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రీ ట్విస్టు అనుకోవాలేమో. అసలైన ట్విస్ట్ మరికొద్దిసేపట్లో ఇవ్వబోతున్నాడు వర్మ. అదేంటో.. వేచి చూద్దాం మరీ.. !