విద్యాబాలన్’ని బలవంతం చేస్తున్నారు

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ దక్షిణాది సినిమాల్లో బలవంతంగానే నటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఇప్పటికే తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో విద్యా నటించిన బసవతారకమ్మ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఆ పాత్రలో విద్యా ఒదిగిపోయిందనే ప్రశంసలు వచ్చాయి. ఐతే, ఈ సినిమాలో నటించేందుకు విద్యా మొదట అంత ఆసక్తిని చూపలేదు. దీంతో బాలకృష్ణ ముంబై వెళ్లి విద్యాని ఒప్పించాల్సి వచ్చింది.

‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత విద్యా కోలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. అదే బాలీవుడ్ ‘పింక్’ రిమేక్. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెచ్‌. వినోద్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.‌ అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను తమిళ స్టార్‌ అజిత్ పోషించనున్నారు. ఇందులో విద్యా బాలన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. నిజానికి రీమేక్‌లలో నటించడం తనకు ఇష్టం ఉండదు. అయినా.. బోనీ కపూర్‌ కోసం ఈ సినిమాలో నటిస్తున్న అంటోంది విద్యా. చూస్తుంటే దక్షిణాది సినిమాల్లో విద్యా బలవంతంగానే నటిస్తున్నట్టు కనబడుతోంది.