‘మహర్షి’ మీద ఆశలు వదులుకొన్నారా ?

సూపర్ స్టార్ మహేష్ ని ‘మహర్షి’గా చెక్కుతున్నాడు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ చిత్రాన్ని దిల్ రాజు -పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే డార్జిలింగ్, అమెరిగా, రామోజీ ఫిలింసిటీ షెడ్యూళ్లు అయ్యాయి. ప్రస్తుతం కేరళ పొలాచ్చిలో అవుతోంది. ఇంకా పాటలకు విదేశాలు వెళ్లాల్సివుంది. దీంతో సినిమా బడ్జెట్ ఈజీగా వంద కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

లాభాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండబోతున్నాయా.. ? అంటే నిర్మాతలకి లాభాలపై ఆశల్లేవ్. వందకోట్ల మార్కెట్ చేసిన ‘భరత్ అనే నేను’ హిట్. ఈ హిట్ సినిమాకి కూడా బయ్యర్లకు 10శాతం వరకు నష్టాలు తప్పలేదు. వంశీపడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఊపిరి’ సినిమా కూడా హిట్ నే. కానీ, నిర్మాత పివిపికి మాత్రం లాస్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ నిర్మాతలు అప్పుడే ఆశలు వదిలేసుకొన్నట్టు సమాచారమ్. మహేష్ తో సినిమా చేశామన్న సంతృప్తిని మాత్రం మిగలనుంది.