రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస హవా !

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోరు చూపిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో తెరాస అత్యధిక స్థానాలని కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం (జనవరి 25) జరిగిన రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు.

రెండవ విడతగా మొత్తం 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 2,694 పంచాయతీలలో లెక్కింపు పూర్తయింది. వీటిలో 1816 మంది తెరాస బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 466 మంది అభ్యర్థులు కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు 17 మంది విజయం సాధించగా టీడీపీ అభ్యర్థులు 20 మంది, సిపిఐ 3 , సీపీఎం 13 పంచాయతీలను గెలుచుకోగా 359 మంది అభ్యర్థులు ఇతరులు గెలుపొందారు.