టీడీపీలోకి కోట్ల ?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారమ్. కోట్ల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారని తెలిసింది. కోట్ల తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబుని కలవబోతున్నారు. కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ తర్వాత కోట్ల టీడీపీలో చేరడంపై స్పష్టత రానుంది.

మరోవైపు, సూర్యప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. రాయలసీమలో కాస్త బలంగా కనిపిస్తున్న వైసీపీని దెబ్బకొట్టడానికి సీం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే కోట్ల ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.