ఎంపీ కవిత ‘క్యాష్’ చేసుకుంటోందట !


నిజామాబాద్‌ ఎంపీ కవిత బుధవారం చౌపాల్‌ ఆన్‌ ట్విట్టర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. వ్యక్తిగత జీవితంపై అడిగిన ప్రశ్నలకి కూడా కవిత ఓపికగా సమాధానం ఇచ్చారు. మీకు జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ కామెడీ షోస్ లో ఏదీ ఇష్టం అని అడగగా.. నేను ఆ రెండు చూడనబ్బా. సుమ యాంకర్ గా వ్యవహరించే ‘క్యాష్’ ప్రోగ్రామ్ ని మా అబ్బాయి చూస్తుంటాడు. దాంతో నేను చూస్తుంటానని తెలిపారు.అలా కవిత క్యాష్ ప్రోగ్రామ్ ని క్యాష్ చేసుకుంటుంది అన్నమాట

ప్రధాని మోదీ గ్రాఫ్‌ రోజు రోజుకు పడిపోతుంది. రాహుల్ గాంధీ ఇంకా మెరుగుపడలేదు. అన్ని రాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు కవిత తెలిపారు. మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదించలేదు. ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలన్నాని కవిత అభిప్రాయపడ్డారు.