బడ్జెట్’లో సినీ పరిశ్రమకు తీపికబురు

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మధ్యతరగతిపై భారీ వరాలు కురిపించారు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు.. అందరిని ఆకట్టుకొన్నేలా బడ్జెట్ ని తీసుకొచ్చారు. ఇందులో సినీ పరిశ్రమకు తీపికబురు అందించారు. భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్‌ విండో విధానం తీసుకొస్తున్నట్టు తెలిపారు. తద్వారా సినీ పరిశ్రమని సంతోషపెట్టింది మోడీ ప్రభుత్వం.

మధ్యంతర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు :

* కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏడాది రూ.6వేలు

* గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయింపు

* గ్రాట్యూటీ పరిమితిని రూ.30లక్షలకు పెంపు

* పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు

* కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు

* 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌

* నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌.

* రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయింపు

* రైల్వేకు రూ.64,500 కోట్లు కేటాయింపు

* భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్‌ విండో విధానం

* కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై తర్వలో నిర్ణయం

* వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.

* రూ.6.5లక్షల వరకూ ఉన్న వారికి బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ

* స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంపు

* పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితి పెంపు

* టీడీఎస్‌ పరిమితి రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంపు