రైతులపై కేంద్రం వరాలు

కేంద్ర ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ లో రైతులపై వరాల జల్లు కురిపించింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏడాది రూ.6 వేలు అందించనున్నారు. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.