మళ్లీ చిక్కుల్లో రాహుల్, హార్థిక్.. !

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్.. జట్టు నుంచి కొన్నాళ్లపాటు సస్పెండ్ కి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరు తిరిగి జట్టులో చేరారు. న్యూజిలాండ్ తో జరిగిన నాల్గో వన్డేలో హార్థిక అదరగొట్టాడు. తన అవసరం జట్టుకు ఎంత ఉందో మరోసారి నిరూపించాడు. దాంతో.. రాహుల్, హార్థికపై నెలకొన్న వివాదం సద్దుమణిగినట్టు అనిపించింది. ఐతే, తాజాగా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌‌పై రాజస్థాన్‌లో కొత్తగా కేసు నమోదైంది.

జోధ్‌పూర్‌లో ఓ వ్యక్తి హార్దిక్, కేఎల్ రాహుల్‌పై కేసు పెట్టాడు. దాంతో.. యువ ఆటగాళ్లు ఇద్దరు మళ్లీ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు హార్దిక్, కేఎల్ రాహుల్‌ లతో పాటు ‘కాఫీ విత్ కరణ్’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ కూడా హాజరవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.