సుకుమార్ కథ నచ్చలేదట !


దర్శకుడు సుకుమార్ ది గొప్ప మనసు. ఆయన అసిస్టెంటులని దర్శకులుగా ప్రమోట్ చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అంటూ ఓ బ్యానర్ స్టార్ట్ చేసి, దాని ద్వారా తన సహాయకులను ప్రమోట్ చేసే పనిని స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో లేటెస్ట్ గా రెండు ప్రాజెక్టులు ప్లాన్ చేశారు. ఇందులో ఒకటి నాగశౌర్య హీరోగా శరత్ మరార్ నిర్మాతగా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందే ‘గీతా 2’ సంస్థలో ఓ సినిమా ప్రకటించారు సుకుమార్.

తన శిష్యుడు సూర్యప్రతాప్ డైరక్టర్ గా నితిన్ హీరోగా ఫిక్స్ చేశారు. ఐతే, ఇప్పుడీ సినిమా ఆగిపోయినట్టు సమాచారమ్. సుకుమార్ తయారు చేసిన, చేయించిన కథ అల్లు అరవింద్ కు నచ్చలేవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కథలో మార్పులు, చేర్పులు చేయమని సుకుమార్ ని అడగడం ఇష్టంలేని అరవింద్.. ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి స్మూత్ గా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఐతే, ఈ కథని సుకుమార్ తన సొంత బ్యానర్ లోనే తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడట. అందుకు ఇంకాస్త పట్టేలా ఉంది. మరీ.. అల్లు అరవింద్ రిజెక్ట్ చేసిన కథతో సుకుమార్ హిట్ కొడతాడా.. ? అన్నది చూడాలి. ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సుకుమార్ తదుపరి సినిమా ఉండనుంది.