‘టైగర్ నాగేశ్వరరావు’ చేతులు మారింది !

స్టూవర్ట్ పురం రాబిన్ హుడ్ అని పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కిట్టూ వున్నాడు జాగ్రత్త’ దర్శకుడు వంశీకృష్ణ టైగర్ నాగేశ్వరరావు జీవితకథని రెడీ చేశారు. దాన్ని నిర్మాత అనిల్ సుంకర ఓకె చేశారు కూడా. శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరరావు పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ని అనుకొన్నారు.

ఐతే, ఇప్పుడీ ప్రాజెక్ట్ చేతులు మారింది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ (అభిషేక్ నామా కాదు) ఈ సినిమాను నిర్మిస్తారు. గతంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా సినిమాలు నిర్మించేవారు. ఇప్పుడు వీరిద్దరు వేరుపడినట్టు కనబడుతోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ని అభిషేక్ అగర్వాల్ సొంత బ్యానర్ లో తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం బెల్లకొండ తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తమిళ సినిమా ‘రాక్షసన్’ రీమేక్ చేయాల్సి వుంది. దాని తరువాత ఈ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటించబోతున్నారు.