పవన్ పై పోటీకి రేణు దేశాయ్ ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వైసీపీ పంచన చేరడం హాట్ టాపిక్ గా మారింది. రేణు దేశాయ్ సాక్షి యాంకర్ గా మారింది. ప్రస్తుతం పవన్ పాదయాత్ర చేస్తున్న కర్నూలులోనే.. రేణు కూడా సాక్షి యాంకర్ గా ప్రజలని ఇంటర్వ్యూ చేస్తోంది. ఐతే, ఇది వైసీపీ ఎత్తుగడ. పవన్ పై పోటీకి రేణుని రంగంలోకి దించిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.

మరోవైపు, కర్నూలులో రేణు దేశాయ్ కూడా రైతుల సమస్యలపై ఇంటర్వ్యూ చేస్తోంది. వారి సమస్యలపై అధ్యయనం చేస్తుందని చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఆమె సాక్షి మైకు పట్టుకొని మరీ.. రైతులని ఇంటర్వ్యూ చేయడం అనుమానాలకి దారితీస్తోంది. పవన్ దారిలోనే రేణుని తీసుకెళ్లి.. వచ్చే ఎన్నికల్లో పవన్ పై రేణుని పోటీకి దింపపోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయ్. ఇదే నిజమైతే.. ఈ మాజీ దంపతుల మధ్య ఫోటీ రసవత్తరంగా మారడం గ్యారెంటీ.. !!