బ్రేకింగ్ : సాక్షి యాంకర్ గా మారిన రేణు దేశాయ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పోటీగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ని రంగంలోకి దించింది వైసీపీ. ఆమెని సాక్షి యాంకర్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ కర్నూలులో సాక్షి మైకు పట్టుకొని ప్రజలని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలు బయటికొచ్చాయ్. దీంతో.. పవన్ కి వ్యతిరేకంగా వైసీపీ రేణుని రంగంలోకి దించినట్టు కనబడుతోంది. గత రెండ్రోజులుగా పవన్ కర్నూలులో పాదయాత్ర చేస్తున్నారు. ఇలాంటి టైంలో రేణు దేశాయ్ సాక్షి యాంకర్ గా కర్నూలులో ప్రత్యక్షం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎత్తుగడ వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని.. ఆయన సలహా మేరకే పవన్ ని ఎదుర్కోడానికి రేణుని వైసీపీ రంగంలోకి దించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ తో విడిపోయిన తర్వాత కూడా ఆయనపై ప్రేమని వ్యక్తం చేసింది రేణు. ఐతే, రేణు రెండో పెళ్లి సమయంలో పవన్ అభిమానులు చేసిన కామెంట్స్ పై మాత్రం సీరియస్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా పవన్ ని పొలిటికల్ గా దెబ్బకొట్టేందుకు రేణు రంగంలోకి దిగడం షాక్ ఇచ్చే విషయమే.ఇంతకీ వైసీపీ పవన్ ని ఎందుకు టార్గెట్ చేసినట్టు ? అంటే.. ఇటీవల

కాలంలో పవన్ మరోసారి టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. మేం ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఐతే, ఇప్పుడు కాకపోయినా.. రేపు ఎన్నికల ఫలితం తర్వాతైనా పవన్ టీడీపీ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ ని గట్టిగా దెబ్బకొట్టేందుకు వైసీపీ రేణుని రంగంలోకి దించినట్టు కనబడుతోంది.