టీ20 సిరీస్ ఆసీస్ కైవసం

బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. భారత్‌లో విరాట్‌ కోహ్లీ (72; 38 బంతుల్లో 2×4, 6×6), లోకేశ్‌ రాహుల్‌ (47; 26 బంతుల్లో 3×4, 4×6), ధోనీ (40; 23 బంతుల్లో 3×4, 3×6) రాణించారు.

భారత్‌ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (113 నాటౌట్‌; 55 బంతుల్లో 7×4, 9×6) దుమ్మురేపాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. టీమిండియా బౌలర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా డీఆర్సీ షార్ట్‌ (40; 28 బంతుల్లో 6×4) నిలిచాడు. రెండు టీ20 మ్యాచ్ లతో ఆసీస్ గెలిపొంది సిరీస్ ని సీప్ చేసింది.