భారత్‌-పాక్ ఇదే అంతిమ యుద్ధం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాగల 72 గంటలు అత్యంత కీలకమని పాక్‌ రైల్వే శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు. యుద్ధమా, శాంతా అనేది వచ్చే 72 గంటల్లో తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా మారే అవకాశం ఉందని అన్నారు. భారత్‌-పాక్‌ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి భారత్ పై పాకిస్థాన్ యుద్ధానికి రెడీ అవుతుందని అర్థమవుతోంది.