రిలీజ్ డేటుపై ‘మహర్షి’ క్లారిటీ ఇచ్చాడు

వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’ పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే, షూటింగ్ లో జాప్యం కారణంగా ఏప్రిల్ 5న ‘మహర్షి’ రావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో ‘మహర్షి’ విడుదల ఎప్పుడన్నది ఎవ్వరికీ తెలీదు. దర్శకుడు వంశీపైడిపల్లి ‘మహర్షి’ని తాపీగా చెక్కుతున్నాడు. షూటింగ్ ఎప్పుడు పూర్తవ్వనుంది. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుంది అనే విషయాన్ని ఇప్పట్లో చెప్పలేం అనే ప్రచారం జరుగుతోంది. ఐతే, తాజాగా మహర్షి విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

‘రెండు పాటల చిత్రీకరణ మినహా.. మార్చి 15కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతోంది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. ఏప్రిల్ 25న మహర్షి విడుదలకి అన్నీ ఏర్పాట్లు చేసుకొంటున్నాం’ అని ట్విట్ చేశారు దిల్ రాజు. దీంతో మహర్షి రాక ఏప్రిల్ లోనే అనే విషయం స్పష్టమైనట్టుంది.