అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ !


మహాశివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సుకుమార్-బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన 20వ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించాయి. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం బన్నీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నార.అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.