మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు


ఈనెల 10న జరగబోయే ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలలో శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా ప్యానల్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఇటీవల కొంతమంది మీడియా ముందుకెళ్లి ‘‘మా’పై లేనిపోని అభియోగాలు చేస్తున్నారు. అవి వినీ ఊరుకుంటే మేమేదో తప్పు చేశామని ప్రజలు అనుకుంటారు.అందుకే మేం కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. వాళ్లంతా నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేం ఏం చేశామో అందరికీ తెలుసు. మేం తెల్లని వస్త్రంలా స్వచ్ఛంగా ఉన్నాం’ అన్నారు శివాజీరాజా.