‘చిత్రలహరి’ టీజర్ ముహూర్తం ఫిక్స్

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. ఇదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు తేజు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించబోతున్నారు.

ఇందులో భాగంగా టీజర్ విడుదలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు (మార్చి 13) ఉదయం 9గంటలకి చిత్రలహరి టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని ట్విట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ఈ పోస్టర్ పై తేజు, ఇద్దరు హీరోయిన్స్ తో పాటు సునీల్ ఫోటోను ఉంచారు. దీంతో సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.