‘చిత్రలహరి’ టీజర్ టాక్

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘చిత్రలహరి అప్పట్లో దూరదర్శనలో ఎవ్రీ ఫ్రైడే వచ్చే ఓ పోగ్రామ్. ఈ చిత్రలహరి 2019లో ఓ ఫ్రెడే రిలీజ్ అవ్వబోయే సినిమా. అందులో కొన్ని పాటలు. ఇందులో కొన్ని పాత్రలు.. ‘ అంటూ టీజర్ మొదలైంది.

మొదటి పాత్ర నివేత పేతురాజ్.. “మగళ్లంతా సేమ్. మనల్ని రీచ్ అయ్యే వరకు ఒకలా ఉంటారు. రీచైన తర్వాత అందరూ ఒకేలా ఉంటారు” అనే డైలాగ్ చెప్పించారు. టీజర్ లోనే నివేత కన్నీళ్లు పెట్టుకోవడం చూడొచ్చు. రెండో పాత్ర కళ్యాణి ప్రియదర్శిన్.. “నా గురించి నేను చెప్పాలంటే.. నీడ్ సమ్ టైం. డిస్కస్ చేయాలి” అంటూ చాలా ఇన్నోసెంట్ గా చెబుతోంది.

మూడో పాత్ర సునీల్… వైన్ శాపులో ఓ కామెడీ బిట్. అసలు పాత్ర సాయి ధరమ్ తేజ్.. నా పేరు విజయ్. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడొస్తుందో.. అని ధీనంగా చెబుతుండగానే కరెంట్ పోతుంది. అప్పుడే వెయిటర్ వచ్చినప్పుడే చూసుకొందాం లే అన్నా.. ! నీ దెబ్బకి కరెంట్ కూడా పోయిందనే డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని కామెడీ, ఎమోషన్స్ బిట్స్ చూపించారు. ఫైనల్ టచ్ గా బాధపడకు బాబాయ్ నీకు ఓ మంచి రోజు వస్తుంది అంటే.. ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మను బాబాయ్. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను అంటూ తేజు చెప్పడం చూడొచ్చు.

మొత్తంగా.. ‘చిత్రలహరి’లో ఎమోషన్స్ తో కూడిన కథగా టీజర్ ని చూస్తే అర్థమవుతోంది. ఏమాత్రం కథని రిలీవ్ చేయకుండా సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్ ని కట్ చేశారు. ఇందులో తేజు సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ తో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.