పవన్ హెలికాప్టర్‌ ప్రచారం

సమయం లేదు మిత్రమా. ఎన్నికల ప్రచారానికి పెద్దగా సమయం లేదు. మరో 28 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు, ఎన్నికల ప్రచారాన్ని జెడ్ స్వీడుతో నిర్వహించేందుకు ప్లాన్ చేసుకొంటున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌ సాయంతో ఎన్నికల ప్రచారం చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారమ్. రోజుకు 3 చోట్ల ఎన్నికల ప్రచారం చేసే విధంగా పవన్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇందుకోసం హెలికాప్టర్‌ వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నారు.

మరోవైపు, అభ్యర్థులని ఖరారు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఆ పేర్లు బుధవారం వెల్లడించే అవకాశముంది. ఇక, కమ్యూనిస్టు పార్టీలతో సీట్ల సర్థుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఐతే, జనసేనకు బలం ఉన్న స్థానాలనే వామపక్షాలు ప్రతిపాదిస్తుండటంతో ఈ విషయంపై పార్టీ అధినేత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఈ నెల 16న క్లారిటీ రానుంది.